March 2026
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి.మార్చి.1,26(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)44 ఏళ్ల తర్వాత సొంత ఇంటికి చేరిన మావో మల్లోజుల పెద్దపెళ్లికి కుటుంబ సభ్యుల ఆప్యాయ పలకరింపు..మావోయిస్టు పార్టీ మాజీ పొలిటి బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ భార్య తారతో కలిసి.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన ఇంటికి ఆదివారం వచ్చారు.సోదరుడు అంజయ్యతో పాటు కుటుంబ సభ్యులు మల్లోజులను ఆప్యాయంగా పలకరించి అలింగణం చేసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.1980 వ దశలో అన్న కిషన్ జితో కలిసి ఉద్యమ బాటపట్టి 44 ఏళ్ల పాటు సాయిధ పోరాట జీవితం గడిపిన మల్లోజుల ఇటీవల తన భార్య తారతో కలిసి మహారాష్ట్ర సీఎం ముందు ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన విషయం తెలిసిందే..అయితే అప్పటినుంచి మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రత కల్పిస్తున్నది.మల్లోజుల సోదరుడు అంజన్న ఇటీవల అనారోగ్యానికి గురి అయ్యారు.ఆయనను కలవడానికి వచ్చిన మల్లోజులను.పెద్ద సంఖ్యలో బంధువులు.స్నేహితులు తరలివచ్చారు కొంతసేపు కుటుంబ సభ్యులు.స్నేహితులతో కలిసి సరదాగా ముచ్చటించారు.ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని అందరితో కలిసి ఫోటోలు దిగారు.మల్లోజుల పర్యటనకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.మల్లోజుల వెంట వచ్చిన మహారాష్ట్ర పోలీసు బృందం అక్కడి కదలికలపై ప్రత్యేకంగా నిఘ ఉంచింది.అయితే మల్లోజుల మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు.మల్లోజుల రాక పెద్దపల్లిలో చర్చనీయంగా మారింది...