MEDIGADDA TV NEWS CEO

MEDIGADDA TV NEWS CEO
CEO ANAPARTHI SRINIVAS GOUD Mobile Number 9848223934 9618970144

MEDIGADDA TV NEWS INCHARGE

MEDIGADDA TV NEWS INCHARGE
ANAPARTHI SAITEJA GOUD, PHONE NO.9502908070

Total Pageviews

Trending Now

TRENDING NOW

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


న్యూఢిల్లీ: NDA కూటమి తరఫున ఉపరాష్ట్రపతి పదవికి సి.పి. రాధాకృష్ణన్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో స్పందించారు. రాధాకృష్ణన్‌ను అభినందిస్తూ ప్రధాని మోదీ పేర్కొన్నారు: “రాధాకృష్ణన్‌ గారు పార్లమెంటు సభ్యుడిగా, తమిళనాడు గవర్నర్‌గా ఎంతో అనుభవాన్ని సంపాదించారు. ప్రజాజీవితంలో ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమైనవి. ఎల్లప్పుడూ అంకితభావంతో ప్రజల కోసం కృషి చేశారు. రాజ్యాంగంపై ఆయనకు ఉన్న పట్టు దేశానికి ఒక ఆస్తి” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, NDA తరఫున రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం పట్ల తాను ఆనందంగా ఉన్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “రాధాకృష్ణన్‌ గారు విశాల అనుభవం కలిగిన నేత. ఆయన ఎంపికతో దేశానికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ గౌరవనీయమైన బాధ్యతలో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు. రాధాకృష్ణన్‌ రాజకీయ జీవితం విశేషంగా సాగింది. రెండు సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ఆయన, తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కీలకపాత్ర పోషించారు. అనంతరం జార్ఖండ్, తెలంగాణ గవర్నర్‌గా కూడా వ్యవహరించి పరిపాలనా అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. NDA తరఫున రాధాకృష్ణన్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం వల్ల ఆయన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

సంగారెడ్డి పట్టణంలో ద మాస్టర్ మైండ్ పాఠశాలలో 79 వ స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాల చైర్మన్ దార సింగ్ జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పాఠశాలలో విద్యార్థులతో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు మరియు డ్రాయింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు 

పాఠశాల చైర్మన్ దారాసింగ్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఎందరో మహానీయులు పోరాటాలు మరెన్నో బలిదానాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వతంత్ర ఫలాలు చివరి గడపకు చేరిన నాడే సంపూర్ణ సార్థకత చేకూరుతుంది అని అన్నారు మహాత్మా గాంధీ నడిపించిన భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తితో అన్ని రంగాల్లో సబండ వర్గాల అభ్యున్నతి దిశగా దేశ పాలకుల కార్యచరణ మరింత చిత్తశుద్ధితో అమలుచేసి ఫలితాలు సాధించడం ద్వారా మాత్రమే స్వతంత్ర పోరాట త్యాగదనులకు మనం అర్పించే ఘన నివాళి అని తెలియజేశారు

భారత స్వతంత్రం దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీకున జరుపుకుంటా ఈరోజు మన దేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందిన రోజు 1947లో ఎన్నో సంవత్సరాల పోరాటం తర్వాత మన దేశం బ్రిటిష్ వారి నుండి విముక్తి పొందినది అని తెలిపారు సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ వంటి గొప్ప నాయకులు మన స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు వారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మనకు స్వచ్ఛ ను ఇచ్చారు మనం ఈరోజు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాంధవి. ఉపాధ్యాయులు విజయరాణి.సానియా. జ్యోతి. అక్షయ. పూజ. స్వప్న. ప్రవనిత. సుమతి. శోభారాణి. సరస్వతి. విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని ఘనపురం మండల కేంద్రంలో పోలీస్‌ సర్కిల్‌ నూతన కార్యాలయాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులతో కలిసి ఎస్పి కిరణ్ ఖరే  గురువారం  ప్రారంభించారు. గతంలో చిట్యాల సర్కిల్‌ లో ఘనపురం, రేగొండ  ఉండేది. నూతంగా కొత్తపల్లి గోరి  పోలీసు స్టేషన్ ఏర్పాటుతో  ఘనపురం, రేగొండ, కొత్తపల్లి గోరిని నూతన పోలీసు సర్కిల్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ  మేరకు సర్కిల్‌ ఇన్స్‌స్పెక్టర్‌గా సిహెచ్ .కరుణాకర్ రావును జిల్లా ఎస్పీ  నియమించారు. దీంతో ఘనపురం పోలీస్ స్టేషన్  పై అంతస్తులో నూతన సర్కిల్‌  కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ  పూజలు చేసి, కార్యాలయాన్ని ప్రారంభించి, సిఐ కరుణాకర్ రావును అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే ,ఎస్పీ మాట్లాడుతూ  ఘనపురం  జిల్లా కేంద్రానికి దీటుగా అభివృద్ధి చెందుతున్నదనీ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తతకూడదని, పరిపాలన సౌలభ్యం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం నూతన సర్కిల్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 


ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి నరేష్ కుమార్ భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు, చిట్యాల సిఐ మల్లేష్,  , ఎస్సై అశోక్, గణపురం ఎమ్మార్వో, ఎంపీడీవో ఘనపురం మండల రాజకీయ నాయకులు, ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో 

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే , భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. 

 గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా కేంద్రంలోనీ వ్యాపార సముదాయాలు మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వివిధ వ్యాపార సంస్థలు, జెన్కో సహకారంతో ఏర్పాటు చేసిన 160 సీసీ కెమెరాలను ఎస్పీ కిరణ్ ఖరే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎమ్మెల్యే సత్యనారాయణ రావు, జెన్కో, జిల్లా కేంద్రంలోని వివిధ వ్యాపార వాణిజ్య, మరియు దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. 


నేరాలను తక్షణమే పరిష్కరించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. భూపాలపల్లి జిల్లాలో గతంలో ఉన్న సీసిటీవీ కెమెరాస్ కన్నా అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేశామని, రేగొండ నుంచి కాళేశ్వరం వరకు నిఘా నేత్రం ద్వారా నిఘా ఉంటుందని పేర్కొన్నారు. 

సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలనీ ఎస్పీ కోరారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ

 నేరాల అదుపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. మిస్టరీ కేసులను చేధించటంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. పట్టణంలోనే కాదు గ్రామాల్లో సైతం నేరాల కట్టడికి సీసీ కెమేరాలు వినియోగించాలన్నారు. జిల్లా కేంద్రంలో దొంగతనాలు జరుగుతున్నాయని, నేరాలను అరికట్టడానికి సిసి కెమెరాలు చాలా ముఖ్యమని, ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటే దొంగతనాలు అరికట్టడం తొందరగా జరుగుతుందని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో పోలీస్ శాఖకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. నాయకులు వ్యాపారవేత్తలు దాతలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పీ నరేష్ కుమార్, సింగరేణి జిఎం రాజేశ్వరావు, పట్టణ ఛాంబర్ అఫ్ కామర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాంచంద్రరావు, డాక్టర్.కిరణ్, డిఎస్పీ సంపత్ రావు, సిఐనరేష్ కుమార్, జిల్లా పరిధిలోని సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

హనుమకొండ లష్కర్ సింగారంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో  ఈ రోజు ఎంతమందిని పరీక్షించారు, EHMIS ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసిన వివరాలను కలెక్టర్ వైద్యాధికారి డాక్టర్ హైదర్ ను  అడిగి తెలుసుకున్నారు.  అలాగే ఈ- ఔషదీ పోర్టల్ లో నమోదు చేసిన మందుల వివరాలను , సెంట్రల్ మెడికల్ స్టోర్ నుంచి అందుకున్న మందుల వివరాలను, ఇష్యూ చేసిన వివరాలను అలాగే స్టోర్ లో నిల్వ ఉన్న మందులను పరిశీలించారు. టీబీ  ముక్త్ అభియాన్ లో ఎంత మందిని పరీక్షించారు , ఏ ఏ హై రిస్క్ గ్రూపుల వారిని పరీక్షించారు, వారి వివరాల నమోదు,phc లో నమోదు చేసిన  గర్భిణీ ల వివరాలు,NCD లో బిపీ,షుగర్ నిర్ధారణ, మందుల పంపిణీ , ఫాలో అప్ వివరాలను పరిశీలించారు.టీబీ  హై రిస్క్ గ్రూపుల వారికి స్క్రీనింగ్ ఎక్కువ సంఖ్యలో నిర్వహించాలని వైద్యాధికారి, వైద్యులకు సూచించారు.


నమోదైనటువంటి గర్భిణీ స్త్రీలకు ఏ సేవలు అందిస్తున్నారు ,అలాగే ప్రసవానంతర సేవలను ఏ విధంగా అందిస్తున్నారనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫీవర్ సర్వే నిర్వహించాలని,డ్రై డే కార్యక్రమం పట్ల ప్రజలకు భాగస్వాములను చేస్తూ అవగాహన కలిగించాలన్నారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ అప్పయ్య, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హైదర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

హనుమకొండ జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, వైద్యాధికారులు అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలను అందించాలని సీజనల్ వ్యాధుల నియంత్రణ పర్యవేక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. 

గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న వైద్య సదుపాయాలపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, వివిధ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సమావేశంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. హనుమకొండ జిల్లాకు డెడికేటెడ్ కలెక్టర్ గా స్నేహ శబరీష్ ఉన్నారని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కు సీజనల్ వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా తనను నియమించిందని పేర్కొన్నారు. బుధవారం రోజున హనుమకొండ జిల్లా పరిధిలోని వంగపహాడ్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశామని తెలిపారు. అదేవిధంగా సిద్దాపూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించినట్లు చెప్పారు. గ్రామాలు, వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని, మురుగు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు సిబ్బంది అప్రమత్తం గా ఉండాలన్నారు. డెంగ్యూ కేసుల పట్ల ఇక్కడి వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు ఎంతో బాగున్నాయని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు  తీసుకుంటున్న చర్యలలో గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. 

కలెక్టర్ ఆధ్వర్యంలో డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్, తదితర వ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఎవరైనా సీజనల్ వ్యాధుల బారిన పడినట్లయితే  అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్సను అందించాలన్నారు. గ్రామాలలో సీజనల్  వ్యాధులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. 

హెచ్ఐవి నియంత్రణలో భాగంగా అనుమానిత లక్షణాలతో ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలు చేయించి వారి జీవన ప్రమాణాన్ని పెంచే విధంగా కృషి చేయాలని వైద్యాధికారులకు సూచించారు. వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి పేషెంట్లకు  వైద్య సేవలు అందించాలని, క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలను నిర్వహించాలని  పేర్కొన్నారు. 

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో డ్రై డే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆశాలు, ఏఎన్ఎంలతో గ్రామాలలో ఫీవర్ టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

సమీక్షా సమావేశంలో ముందుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ డెంగ్యూ కేసులు ఉన్నచోట్లా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వైరల్, ఫివర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు 

జనవరి నుండి ఇప్పటి వరకు  మలేరియా పొజిటీవ్ ఒక కేసు, డెంగ్యూ పాజిటివ్ కేసులు 48 వరకూ నమోదయ్యాయని తెలియజేశారు.  గత సంవత్సరం 182 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. డీపీవో లక్ష్మీ రమాకాంత్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో ఉన్న తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయించినట్లు తెలిపారు. మురుగు నీరు నిలవకుండా  చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దోమల నివారణ చర్యల్లో భాగంగా ఆయిల్ బాల్స్ వేస్తున్నామని, దోమల లార్వా పెరగకుండా  చర్యలు తీసుకుంటున్నట్లు  పేర్కొన్నారు.  పారిశుద్ధ్య నిర్వహణ బాగుండే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ మదన్ మోహన్ రావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ గౌతమ్ చౌహన్, వివిధ ఆసుపత్రుల  వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ 


ఉమ్మడి వరంగల్;

 హనుమకొండ జిల్లా లో 

వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాష్ట్రంలో అల్పపీడనం వల్ల కురిసే భారి నుంచి అతి భారీ వర్షాల వల్ల ఎక్కడ ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్  సచివాలయం నుంచి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యూరియా నిల్వల పై సీఎస్ కే. రామ కృష్ణా రావు తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్  పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ   2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలోనే కొన్ని ప్రాంతాలలో కురుస్తున్నాయని అన్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం వరదల సమయంలో నష్ట నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు. 

వరద పరిస్థితుల పై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని,  ప్రజలకు ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జర్గకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు ముందస్తుగా కోటి రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా విడుదల చేస్తామని అన్నారు.

వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని అన్నారు. వరద సహాయక చర్యల్లో పోలీసు యంత్రాంగం సహకారం పూర్తిస్థాయిలో తీసుకోవాలని అన్నారు. 

సిఎస్ కే.రామ కృష్ణా రావు మాట్లాడుతూ, వాతావరణ శాఖ సూచన ప్రకారం  తూర్పు, దక్షిణ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ జారీ చేసిందని అన్నారు.  మిగిలిన ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిందని అన్నారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లాలో కలెక్టర్ వద్ద ఉన్న డిజాస్టర్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎస్ సూచించారు.  వరద అంచనా వేస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు.  రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పనిచేయాలని సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. 

ఉదృతంగా ప్రవహించే వాగులు, చెరువుల సమీపంలో గల రోడ్లు, కల్వర్ట , వంతెనలను మూసి వేయాలని అన్నారు. పట్టణ ప్రాంతాలలో కొన్ని కాలనీ లలో ఇండ్లకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని, అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.  ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రజల అవసరమైతేనే బయటకు రావాలని అన్నారు.

రాష్ట్రంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని, రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో పెట్టాలని, ఎక్కడ ఎటువంటి లోటు పాట్లు ఉండకుండా చూసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, కె నారాయణ, జిల్లా అధికారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Blog Archive